Radio LIVE


Breaking News

Monday 23 February 2015

డబుల్ సెంచరీతో దుమ్మురేపిన క్రిస్ గేల్,రికార్డు భాగస్వామ్యం నమోదు

కాన్ బెర్ర: ప్రపంచకప్ క్రికెట్ లో జింబాబ్వే తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగించింది.క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.డబుల్ సెంచరీ చేసిన రెండో దేశస్థుడు అయ్యాడు గేల్ ఈ మ్యాచ్ ద్వారా.
వన్డేల్లో భారత్ కాకుండా వేరే దేశ ఆటగాడు డబుల్ సెంచరీ చేయడం ఇదే మొదలు.ఇప్పటివరకు నాలుగు డబుల్ సెంచరీలు నమోదుకాగా ఆ నాలుగు భారత్ ఆటగాళ్లే చేయడం విశేషం.వన్డేల్లో మొదటి డబుల్ సెంచరీ సచిన్ చేశాక ,సెహ్వాగ్ ఆ తరువాత రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీ లు చేశారు.
గేల్ 215 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు.

గేల్ తూఫాన్ కు బద్దలైన రికార్డులు :

సామ్యుల్స్ తో కలిసి వన్డేల్లో అన్ని వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం(372) నెలకొల్పాడు.

ప్రపంచకప్ లో అధ్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.

వన్డేల్లో అత్యధిక సిక్సుల రికార్డు(16) సమం.

ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో మొదటి డబుల్ సెంచరీ నమోదు.

వెస్టిండీస్ కు ఇదే అత్యుత్తమ స్కోరు.

తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ.

వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.జట్టు స్కోరు సున్నా దగ్గరే స్మిత్ వికెట్ కోల్పోయింది విండీస్.అక్కడ గేల్ కు తోడుగా సామ్యుల్స్ చివరి బంతి వరకు క్రీజ్ లోనే పాతుకుపోయారు.
చివరి పది ఓవర్లలోనే 150 కి పైగా పరుగులు సాధించారు ఇద్దరూ కలిసి.విండీస్ ఫీల్డర్లు మ్యాచ్ చూసేవాళ్ళు,మ్యాచ్ చూడడానికి వచ్చిన వారు ఫీల్డర్లుగా మారిపోయారు గేల్ తూఫాన్ కు.
నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ రెండు వికెట్లు కోల్పోయి 372 పరుగులు చేసింది.సామ్యుల్స్ 133 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates