Radio LIVE


Breaking News

Sunday 31 May 2015

రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్,ఓటు వేసే అవకాశం కల్పించిన కోర్టు

ఆదివారం సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయిన రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఏసీబీ న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరిచారు.
అనంతరం రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.రేవంత్ రెడ్డి మీద 120B, 34 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఏ 1 - రేవంత్ రెడ్డి
ఏ 2 - సెబాస్టియన్
ఏ 3 - ఉదయ్ సింహ
ఏ 4 - మాథ్యూస్ జెరూసలెం
ఐతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమంతించాలని రేవంత్,న్యాయమూర్తిని కోరగా అందుకు పిటీషన్ దాఖలు చేయమని కోరగా అందుకు రేవంత్ రెడ్డి లాయర్లు పిటీషన్ దాఖలు చేయగా అందుకు న్యాయమూర్తి ఓటు వేసేందుకు అనుమతించారు.అనంతరం 14 రోజుల రిమాండ్ కోసం రేవంత్ ను చర్లపల్లి జైలు కు తరలించనున్నారు.
ఓటు వేసేందుకు రేవంత్ ను పోలీసులు అసెంబ్లీ ఆవరణకు తీసుకొచ్చారు.రేవంత్ వచ్చే వరకు అసెంబ్లీ ప్రాంగణంలోనే టీ-టీడీపీ ఎమ్మెల్యేలు వేచి ఉండి రేవంత్ రాగానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు తోటి ఎమ్మెల్యేలు.అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో కొంతసేపు భేటీ అయ్యారు. ఆ తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ను కలిశారు.
Read more ...

మరో వీడియో:రేవంత్ రెడ్డి స్వయంగా డబ్బులు పంచుతూ

మరో వీడియో విడుదలైంది.రేవంత్ రెడ్డి స్వయంగా డబ్బులు సర్దుతూ వీడియో లో స్పష్టంగా కనిపిస్తుంది.డబ్బులున్న నల్లటి సంచిలోనుండి రూ.1000 ,రూ.500 నోట్ల కట్టలను అక్కడే ఉన్న టేబుల్ మీద అతనితోపాటు వచ్చిన మరో వ్యక్తి సర్దారు. బ్యాగ్ తీసుకురా,డోర్స్ పెట్టండి అని రేవంత్ అనగానే,ఎవరూ రారు అని స్టీఫెన్ చెప్పాడు. కానియ్యి కానియ్యి తొందర పావాలే పని ఉంది,మై సైడ్ వెరీ క్లియర్,మొత్తం రూ.50 లక్షలు ఇప్పుడు తీసుకోండి.రేపు మిగతా నాలుగున్నర తీసుకోండి,నాలుగున్నర అంటే ఏంటి అని స్టీవెన్ అనగానే నాలుగున్నర కోట్లు అని రేవంత్ సమాధానం ఇచ్చారు.మీకేమి కాదు,నేను ఉన్నాను. రేవంత్ అరెస్ట్ అయిన సమయంలో అతను వేసుకున్న టీ-షర్ట్ రంగు,అతను డబ్బులు పంచుతున్నప్పుడు వేసుకున్న షర్ట్ రంగు ఒకటే.
Read more ...

లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి-వీడియో మీడియాలో

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు లంచం ఇస్తూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
సోమవారం జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని అందులో భాగంగా సికింద్రాబాద్ లోని లాలాగూడ  స్టీవెన్ సన్ కుమారుడి ఇంట్లో  రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి.అప్పటికే అక్కడే మాటు వేసి ఎదురు చూస్తున్న ఏసీబీ అదను చూసి రేవంత్ ను పట్టుకున్నారు.
రేవంత్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తు రెండు సంచులు కూడా పోలీసులు తీసుకెళ్ళారు.రేవంత్ మీద ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు పోలీసులు.
రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ప్రలోభాలకు లోనుచేస్తున్నాడని స్టీవెన్ సన్ చెప్పాడు.
రేవంత్ రెడ్డి ని ఏసీబీ ఆఫీస్ లో విచారిస్తున్నారు.రేపు కోర్టు లో హాజరు పరుస్తారు.
అయితే రేవంత్ రెడ్డి,స్టీవెన్ సన్ ల మధ్య జరిగిన సంభాషణ ను ఏసీబీ విడుదల చేసింది.
ఈ వీడియో లో "బాసే నన్ను ఇక్కడికి పంపించారు.మీరేదైనా నెంబర్(money) చెప్తే నేను బాస్ తో మాట్లాడి సమాచారం అందిస్తాను.మీకు ఏలాంటి సమస్య రాదు,17 మంది ఎమ్మెల్యేలతో పాటు మీరు.తెలంగాణాలో పార్టీని నేనే లీడ్ చేసేది,నా కూతురి పెళ్లి అయ్యాక నేను ఫ్రీ అవుతాను,నీకేమైనా సమస్య వస్తే ఆంధ్రలో ఇప్పిస్తాను.నాకు కులం ఉంది,బంధువులు ఉన్నారు,జైపాల్ రెడ్డి నాకు మామ,జానారెడ్డి కూడా నాకు బంధువే,జానారెడ్డి పని అయిపోయింది, నేను వేం నరేందర్ రెడ్డి కి ఫైనాన్స్ చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి వీడియోలో మాట్లాడారు.రెండున్నర అనే మాట వాడారు రేవంత్ ఈ వీడియో లో".

Read more ...

మహేష్ బాబు 'శ్రీమంతుడు' టీజర్ విడుదల

మైత్రి మూవీ మేకర్స్,మహేష్ బాబు నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న 'శ్రీమంతుడు' టీజర్ ను ఆదివారం విడుదల చేశారు.కొరటాల శివ దర్శకతంలో మహేష్ బాబు,శృతి హసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న శ్రీమంతుడు టీజర్ ను విడుదల చేశారు.
Read more ...

Saturday 30 May 2015

ప్రిన్స్ మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' లోగో విడుదల,షూటింగ్ షురూ

ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి చిత్రం 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ విడుదల అయిన 24 గంటల్లో 'బ్రహ్మోత్సవం' లోగో ను విడుదల చేశారు.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న 'బ్రహ్మోత్సవం' షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31 న ప్రారంభం కానుంది.

కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా 'బ్రహ్మోత్సవం' లోగో ను విడుదల చేశారు.లోగో లో పేరు పక్కనే వెంకటేశ్వర స్వామి పాదాలు,పూర్ణ కుంభం ఉన్నాయి.'బ్రహ్మోత్సవం' పేరు చూడడానికి చాలా బాగుంది.

పీవీపీ బ్యానర్ లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది.పద్మాలయ స్టూడియోస్ లో మే 31న చిత్ర పూజా కార్యక్రమాలు జరుగుతాయి.



Read more ...

బాహుబలి ది బిగినింగ్ టీజర్ విడుదల చేసిన నటి అనుష్క

మొదటిసారి బాహుబలి చిత్ర టీజర్ ను శనివారం సాయంత్రం 7:25 నిమిషాలకు విడుదల చేశారు నాటి అనుష్క. జూన్ 1,2015న బాహుబలి చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. టీజర్ మీకోసం... వీక్షించండి....
Read more ...

గోకడం వల్ల దురద నుండి ఎందుకు ఉపశమనం కలుగుతుంది


గోకడం ఉపశమనాన్ని ఇస్తుంది.దురద చోట గోకుతుంటే ఎందుకు పదే పదే గోకాలనిపిస్తుంది? పదే పదే గోకడం వల్ల శరీరానికి ఏమైనా హాని కలుగుతుందా మొదలగు అంశాల గురించి తెలుసుకుందాం.
నిజానికి దురద కలిగినప్పుడు గోకడం కంటే అతిపెద్ద ఉపశమనం లేదు అని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.కొంతమంది దురదను తట్టుకోలేక రక్తం వచ్చేలా గోక్కుంటారు.
ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే దురద పెట్టడానికి మన చర్మం ఏ విధంగాను కారణం కాదంట,అలాగే గోకడం వల్ల చర్మానికి ఏలాంటి ఉపశమనం ఉండదట.వెన్నుపూసలో ఉండే ప్రత్యేక నాడీ కణాల వ్యవస్థ దురద,గోకడం వంటి వాటిని పూర్తిగా నియత్రిస్తుంది.శరీరం మీద దురద కలిగినప్పుడు ఈ ప్రదేశంలో ఉండే నాడీ కణాలు చాలా చురుకుగా ఉంటాయి. కోతులమీద ప్రయోగం చేసి మరీ ఈ విషయాన్ని తెలుసుకున్నారు.వెన్నుముక లో ఉండే STT(spinothalamic tract ) నాడీ కణాలు నొప్పిని,శరీరానికి తాకే వేడిని ఇవి మెదడుకు చేరవేస్తాయి.

మెదడులోని ఏ భాగం అయితే బాధ కలిగినప్పటి సంకేతాలను గ్రహిస్తుందో అదే భాగం దురద సంకేతాలను స్వీకరిస్తుంది.
నిజానికి సాధారణంగా వచ్చే దురదకు-గోకడానికి మధ్య శారీరక పరమైన నిర్మాణ సంబంధం ఏంటో డాక్టర్లు కూడా తెలుసుకోలేకపోయారట.
దురదకు కారణం మెదడులో సెరొటోనిన్ విడుదల అవుతుంది.ఇదే దురద తీవ్రతను పెంచుతుంది.గోకినప్పుడు కలిగే నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది.ఈ నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు అందినప్పుడు న్యూరో ట్రాన్స్ మిట్టర్ సెరొటోనిన్ నొప్పి అనే బాధను నియంత్రిస్తుంది.ముఖ్యంగా దీర్గకాళిక దురదతో బాధ పడే వాళ్ళలో దురద నొప్పికి కారణం అవుతుంది.శరీరం నొప్పి సంకేతాలకు ప్రభావితం అయినప్పుడు మాత్రం దురద అనేది మరింత బాధను కలిగిస్తుంది.
మరి సెరొటోనిన్ ను నియంత్రిస్తే పూర్తిగా దురద తగ్గుతుందా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సెరొటోనిన్ ఎముకల జీవక్రియకు,ఎదుగుటకు,వృద్దాప్యం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సెరొటోనిన్.
Read more ...

మ్యాగీ నూడుల్స్ వివాదం : విచారణను ఎదుర్కోనున్న నెస్ట్లే ఇండియా


రెండు నిమిషాల మ్యాగీ నూడుల్స్ కు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి.మ్యాగీ నూడుల్స్ తయారి సంస్థ అయిన నెస్ట్లే ఇండియాను త్వరలో ప్రాసిక్యూట్ చేయనున్నారు.ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆహార భద్రత మరియుఔషధ నిర్వహణ(FDA) సంస్థ నెస్ట్లే ఇండియాను విచారించడానికి అనుమతినిచ్చింది.
మ్యాగీ నూడుల్స్ లో ఎక్కువ మోతాదులో సీసం ఉంది అనే ఫిర్యాదుతో అసలు కథ మొదలైంది.ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నెస్ట్లే  కు వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదు కానుంది.
ఉత్తరప్రదేశ్ ఆహార భద్రత మరియు ఔషధ నిర్వహణ(FDA) సంస్థ దాదాపు 12 డజన్లకు పైన్నే వివిధ దుకాణాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ ను సేకరించి పరీక్షంచగా మోతాదుకు మించి సీసం నూడుల్స్ లో వాడినట్టు తేలింది.మ్యాగీ నూడుల్స్ లో 17.2 ppm ల సీసం వాడినట్టు స్పష్టంగా తేలింది.ఇది మోతాదులో వాడాల్సిన దానికంటే చాలా ఎక్కువ.అలాగే ఎక్కువ మొత్తంలో సోడియం గ్లుటామేట్ ను అధిక మొత్తంలో వాడినట్టు పరీక్షలో తేలింది.
ఐతే కంపెనీ వాదన మాత్రం మరోల ఉంది.ఒక్క శాతం కంటే ఎక్కువ మొత్తంలో సీసం వాడలేదని స్పష్టం చేసింది.ఇది లెక్కలోనికి రాదనీ వారి వాదన.
Read more ...

Friday 29 May 2015

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ విడుదల

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు,శృతి హసన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు చిత్ర బృందం.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే-31న ఫస్ట్ లుక్ తోపాటు,టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ భావించినా రెండు రోజుల ముందుగానే శ్రీమంతుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.అయితే టీజర్ ను 31న విడుదల చేసే అవకాశం ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్‌లు సమష్టిగా నిర్మించిన శ్రీమంతుడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు సైకిల్ మీద దూసుకొచ్చే పోస్టర్ ను ముందుకు తీసుకొచ్చారు. అయితే చిత్రాన్ని జూలై 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read more ...

సివిల్స్ ప్రిలిమ్స్-2015 ప్రత్యేకం : ఉచిత ఆన్ లైన్ శిక్షణ – మూడవ భాగం


ఇప్పటి వరకు సివిల్స్ ప్రిలిమ్స్-2015 ప్రత్యేకంలో పేపర్-II లోని బేసిక్ న్యుమరసీలో రెండు భాగాలు పూర్తి చేసుకున్నాం.బేసిక్ న్యుమరసీ మొదటి భాగంలో సంఖ్యా సమితి గురించి,రెండవ భాగంలో test of divisibility గురించి తెలుసుకున్నాం.
మూడవ భాగంలో గుణకారంలో మెళకువలు,కొన్ని లాజిక్ లు తెలుసుకుందాం..
a). 11 చేత గుణించాలంటే :
ఒక సంఖ్యను 11 చేత గుణించినప్పుడు వచ్చే ఫలితం సులభంగా రాబట్టవచ్చు.మొదట ఇచ్చిన సంఖ్యను 10 చేత గుణించాలి(ఇచ్చిన సంఖ్యకు ముందు సున్నా చేర్చితే సరిపోతుంది),గుణించగా వచ్చిన సంఖ్యకు అసలు సంఖ్య ను కలపగా వచ్చేదే సమాధానం. ఇంకా వివరంగా తెలుసుకుందాం.
ఉదా : 349 ను 11 చేత సులభ పద్దతిలో ఎలా గుణించాలో తెలుసుకుందాం.
మొదటి పద్ధతి : మొదట 349 సంఖ్యను 10 చేత గుణించాలి . 349 x 10 = 3490 3490 కి ఇచ్చిన సంఖ్య అనగా 349 ని కలిపితే వచ్చేదే మనకు కావాల్సిన సమాధానం. 3490+349 = 3839
రెండవ పద్ధతి : ఈ పద్దతి చాలా సులభమైన పద్ధతి.మొదట ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను యధాతదంగా రాసుకోవాలి.తరువాత పదుల స్థానంలో వచ్చే అంకె కొరకు మొదటి సంఖ్య లోని ఒకట్లు పదుల స్థానంలో సంఖ్యను కూడగా వచ్చిన అంకె.ఒక వేళ రెంటి మొత్తం పదుల సంఖ్య వస్తే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె మాత్రమే తీసుకోవాలి,పదుల స్థానంలో వచ్చే సంఖ్యను తరువాత కూడిన సంఖ్యకు కలిపి వందల స్థానంలో వేయాలి.ఇదంతా చదివి అర్ధం చేసుకోవడానికి కొంత గందరగోళంగా ఉంటుంది.ఉదాహరణతో చూస్తే చక్కగా అర్థం అవుతుంది.
349 సంఖ్యను 11 తో గుణించినప్పుడు వచ్చే సమాధానంలో మొదట ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 9 ని అలానే వేసుకోవాలి.తరువాత 9 కి పక్కన వచ్చే అంకె ఏంటో తెలుసుకోవడానికి 9 అంకెను 4 అంకెను కలపాలి,ఇప్పుడు వచ్చే 13 లోని 3 ను మాత్రమే సమాధానంలో కలపాలి ఒకటిని క్యారీ గా పక్కన ఉంచుకోవాలి,ఇప్పుడు 4 అంకెను,3 అంకెను కూడగా 7 వస్తుంది,ఈ 7 కు క్యారీ ఒకటిని కలుపగా వచ్చే ఎనిమిదిని సమాధానంలో కలపాలి,
ఇప్పటివరకు 839 అనే సమాధానం వచ్చింది.కాని సమాధానం పూర్తి కాలేదు.చివరిగా 3 మాత్రమే మిగులుతుంది,దీనికి పక్కన వేరే ఇంకో అంకె లేదు కాబట్టి 3 కు సున్నా కలపగా మూడే వస్తుంది,ఈ 3 ను సమాధానంలో కలపాలి.చివరగా మనకు 3839 అనే సమాధానం వస్తుంది.ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. 
349 x 11 ————? 
 i). – – – 9 
ii). 9 + 4 = 13 (- – 39 ) [ 1 – carry]
iii). 4 + 3 = 7 (- 839) [7 కు carry 1 కలుపగా 8 వస్తుంది]
iv). 3 + 0 = 3 (3839) … సమాధానం – 3839
మరో ఉదాహరణ చూద్దాం : 5411 x 11 = 59521
i). ఒకట్ల స్థానంలో 1 ని అలానే వేసుకోవాలి …. (ans : – – – – 1 )
ii). 1 కి పక్కన ఉన్న 1 ని కలుపగా 2 వస్తుంది … (ans : – – – 21)
iii).తరువాత 1 కి పక్కన ఉన్న 4 ను కలుపగా 5 వస్తుంది … (ans : – – 521)
iv).4 పక్కన ఉన్న 5 కలుపగా 9 వస్తుంది … (ans : – 9521)
v).చివరి 5 కు సున్నా కలుపగా 5 వస్తుంది — (ans : 59521)
సాధన చేస్తే పేపర్ మీద పెన్ను పెట్టకుండానే సమాధానం రాబట్టవచ్చు.
b).12 చేత గుణించాలంటే : 

ఏదైనా ఒక సంఖ్యను 12 చేత గుణించాలంటే సంఖ్యలోని ప్రతీ అంకెను డబుల్ చేసి దాని తరువాతి అంకెకు కలుపుతూ పోవాలి.
ఉదా : 2343 x 12 = 28116 … వివరణ చూద్దాం
i). మొదట 3 ను రెట్టింపు చేస్తే 6 … (ans : – – – – 6)
ii). తరువాత 4 ను రెట్టింపు చేసి 3 కి కలపాలి.4 ను రెట్టింపు చేస్తే 8,దీనికి 3 కలిపితే 11.11 లో ఒకటి carry పోతుంది.(ans : – – – 16)
iii). ఇప్పుడు వందల స్థానంలో ఉన్న 3 ను రెట్టింపు చేస్తే 6,దీనికి తరువాతి 4 ను కలిపితే 10.10 కి ఇంతకముందు carry ఒకటి కలిపితే 11 వస్తుంది.పదకొండులో 1 క్యారీ వెళ్తే మిగిలిన ఒకటి సమాధానంలో కలుస్తుంది .. (ans : – – 116)
iv). ఇక రెండు ను రెట్టింపు చేస్తే 4 వస్తుంది. 4 కు పక్క మూడును కలిపితే 7 వస్తుంది. 7 కు ఇంతకముందు క్యారీ ఒకటి కలిస్తే మొత్తం 8 వస్తుంది.8 ని సమాధానంలో కలిపితే .. (ans : – 8116)
v). చివరగా 2 తరువాత మరో అంకె లేదు కాబట్టి సున్నాను రెట్టింపు చేస్తే 0,దీనికి పక్క అంకె 2 కలిపితే 2 వస్తుంది.(ans : 28116)
చివరిగా వచ్చే సమాధానం : 2343 x 12 = 28116
c).13 చేత గుణించాలంటే :
ఇచ్చిన సంఖ్యను 13 చేత గుణించాలంటే సంఖ్యలోని ప్రతీ అంకెను మూడు రెట్లు(అంటే ప్రతీ సంఖ్యను 3 చేత గుణిస్తే సరిపోతుంది) చేసి పక్కన అంకెకు కలిపి సమాధానంలో కలుపుకుంటూ వెళ్ళాలి.
ఉదా : 123 x 13 —- ?
i). 3 ను 3 చేత గుణిస్తే 9 వస్తుంది. (ans : – – – 9)
ii). తరువాత ఉన్న 2 ను 3 రెట్లు చేస్తే 6 వస్తుంది.ఈ 6 ను పక్క అంకె 3 కి కలిపితే 9 వస్తుంది.సమాధానంలో రెండు స్థానాలు వచ్చాయి.(ans : – – 99)
iii). ఇప్పుడు ఒకటిని 3 రెట్లు చేస్తే 3 వస్తుంది.మూడును పక్క రెండుతో కలిపితే 5 వస్తుంది.కాబట్టి సమాధానంలో తరువాతి స్థానం 5.(ans : – 599)
iv). చివరగా ఒకటి పక్కన మరో అంకెలేదు.కాబట్టి ఒకటి పక్కన సున్నా ఉంది అనుకుంటే సున్నాను 3 రెట్లు చేస్తే సున్ననే కాబట్టి ఒకటిని అలానే సమాధానంలో కలిపేస్తే సరి. (ans : 1599)
సమాధానం : 123 x 13 = 1599
ఇంకా సులభమైన గుణకారాలు ఉన్నాయి.అవి తరువాతి భాగంలో నేర్చుకుందాం.
మరిన్ని ఇలాంటి సమాచారం మీ మెయిల్ కు నేరుగా రావాలంటే సబ్ స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.
Read more ...

Thursday 28 May 2015

వెంట్రుకలు,గోళ్ళు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏమిటి ?


శరీరంలో ఏ భాగం కొంచం తెగినా భరించలేని నొప్పి కలుగుతుంది కాని,వెంట్రుకలు మరియు గోళ్ళు కత్తిరించినప్పుడు మాత్రం నొప్పి కలగదు.అందుకు కారణం.............!
గోళ్ళు మృత కణాలతో తయారౌతాయి.సాధారణంగా ఒక మనిషికి కాళ్ళకు,చేతులకు కలిపి 20 గోళ్ళు ఉంటాయి.వీటిని కత్తిరించినప్పుడు ఏలాంటి బాధ,నొప్పి కలగకపోవడానికి కారణం అవి మృత కణాలతో ఏర్పడడమే.శరీరానికి బయటకు వచ్చే ప్రత్యేక అమరిక ఉంటుంది గోళ్ళకు.గోళ్ళలో 'కెరాటిన్' అనే కఠినమైన పదార్థం ఉంటుంది.
గోళ్ళ మొదటి భాగం చర్మానికి అతుక్కొని అనువైన తంతువులుగా ఉంటాయి.ఈ తంతువుల వలన గోళ్ళు  స్థిరంగా వ్రేల్లకు చివర్లో ఉంటాయి.సాధారణంగా గోళ్ళు మందంగా ఉన్నప్పటికీ శరీరం లోపల ఉండే వీటి చిగుర్లు మాత్రం పలచగా ఉంటాయి.సంవత్సరానికి రెండు ఇంచుల వరకు గోళ్ళు పెరుగుతాయి.
అదే విధంగా వెంట్రుకలు కూడా కెరోటిన్ తో తయారు చేయబడిన సూక్ష్మతంతు నిర్మాణం.ప్రతీ నెల 13 మిల్లీమీటర్ల వరకు వెంట్రుకలు పెరుగుతాయి.సాదారణంగా మనిషికి ఒక లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి.
ఇవి మృత కణాలతో తయారు కావడం వల్ల,రక్తనాళాలతో సంబంధం ఉండకపోవడం వల్ల వీటికి రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు.అందువల్ల వీటిని కత్తిరించినప్పుడు నాడీ వ్యవస్థ ఏమాత్రం ప్రభావితం కాదు.కాబట్టి నొప్పి అనే బాధ మెదడుకు అస్సలు తెలియదు.
Read more ...

Wednesday 27 May 2015

ఉచిత స్టడీ మెటీరియల్ రెండవ భాగం : సివిల్స్ ప్రిలిమ్స్-2105

సివిల్స్ ప్రిలిమ్స్ లో బేసిక్ న్యుమరసీ విభాగం నుండి గత సంవత్సరం మొత్తం 18 ప్రశ్నలు అడగడం జరిగింది.ఈసారి కూడా 15 కు పైనే ప్రశ్నలు అడిగే అవకాశాలు లేకపోలేదు.
బేసిక్ న్యుమరసీ మొదటి భాగంలో సంఖ్యా సమితి గురించి తెలుసుకున్నాం.రెండవ భాగంలో భాగాహరంలో మెలుకువలు తెలుసుకుందాం.
ఇచ్చిన సంఖ్య ఏ అంకెతో భాగించబడుతుంది :
i. రెండుతో భాగించబడాలంటే :
 ఏదైనా ఒక సంఖ్య రెండు భాగించబడాలంటే ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో '0' లేదా 'సరి సంఖ్య' ఉంటే ఆ సంఖ్య రెండు చేత భాగించబడుతుంది.
    Ex : 24, 36, 120, 178, ........
ii. మూడుతో భాగించబడాలంటే :
 ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం 3చేత భాగించబడితే ఆ సంఖ్య మూడుతో భాగించబడుతుంది.
    Ex : 255 ... ఇందులో అంకెల మొత్తం = 2+5+5 = 12 
                       12 మూడు చేత నిశ్శేషంగా భాగించబడుతుంది.
iii. నాలుగు చేత భాగించబడాలంటే :
 ఇచ్చిన సంఖ్యలోని చివరి రెండు స్థానాల్లో ఉన్న సంఖ్య, అంటే ఒకట్లు మరియు పదుల స్థానంలో ఉండే సంఖ్య 4 చేత భాగించబడినా లేక చివరి రెండు స్థానాల్లో సున్నాలు ఉన్నా ఆ సంఖ్య నాలుగు చేత భాగించబడుతుంది.
    Ex: 4528 అనే సంఖ్యలో 28 నాలుగు చేత భాగించబడుతుంది.కాబట్టి 4528 అనే సంఖ్య 4 చేత భాగించబడుతుంది.
iv. ఐదు చేత భాగించబడాలంటే : 
 ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో '5' లేదా '0' ఉంటే ఆ సంఖ్య 5 చేత భాగించబడుతుంది.
    Ex : 20, 2450, 155, 4565 etc
v. ఆరు చేత భాగించబడాలంటే :
 ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడినా లేక ఇచ్చిన సంఖ్య రెండు లేదా మూడు చేత భాగించబడినా ఆ సంఖ్య 6 చేత భాగించబడును.
   Ex: 8964 అనే సంఖ్యలో అంకెల మొత్తం 8+9+6+4 = 27... 27 మూడు చేత భాగించబడుతుంది.
vi. ఎనిమిది చేత భాగించబడాలంటే :
  ఏదైనా సంఖ్య ఎనిమిది చేత భాగించబడాలంటే ఆ సంఖ్యలోని చివరి మూడు స్థానాల సంఖ్య 8 చేత భాగించబడి ఉండాలి లేదా చివరి మూడు స్థానాలు సున్నాలు అయినా ఉండాలి.
   Ex : 4384 సంఖ్యలో 384 ఎనిమిది చేత భాగించబడుతుంది,కాబట్టి 4384 సంఖ్య 8 చేత భాగించబడుతుంది.
vii. తొమ్మిది చేత భాగించబడాలంటే : 
  ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం 9 చేత భాగించబడాలి.
   Ex : 4932 అనే సంఖ్యలోని అంకెల మొత్తం 4+9+3+2 = 18.. 18 తొమ్మిది చేత భాగించబడుతుంది.
viii. 10 చేత భాగించబడాలంటే :
 ఇచ్చిన సంఖ్య 10 చేత భాగించబడాలంటే ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో '0' ఉంటే సరిపోతుంది.
    Ex : 100, 2450,3980,etc
ix. 11 చేత భాగించబడాలంటే : 
 ఇచ్చిన సంఖ్యలోని సరి స్థానాల మొత్తం మరియు బేసి స్థానాల మొత్తం బేదం సున్నా అయినా లేక 11 చేత భాగించబడే సంఖ్య వచ్చినా ఆ సంఖ్య 11 చేత భాగించబడును.
   Ex :a . 939532 అనే సంఖ్య 11 చేత భాగించబడుతుంది.ఎలాగో చూద్దాం 
           939532  సంఖ్యలో సరి మరియు బేసి స్థానాల బేదం = 11 ([9+9+3]-[3+5+2])
          b. 1441 అనే సంఖ్య 11 చేత భాగించబడుతుంది. సరి స్థానాల మొత్తం 1+4=5 , బేసి స్థానాల మొత్తం 4+1=5.రెంటి బేధం సున్నా.
x. 7 చేత భాగించబడాలంటే :
 7 చేత భాగించాబడాలంటే ఎలాంటి మెళకువలు లేవు.కాకుంటే చిన్న లాజిక్ ఉంది.అది తెలుసుకుందాం.ఈ లాజిక్ తో  బహుళఐచ్చికప్రశ్నలు(Multiple Choice Questions) తొందరగా సాధించవచ్చు.
ఉదాహరణకు 112 అనే సంఖ్య 7 చేత భాగించబడుతుంది.అది ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం.
112 అనే సంఖ్యను 11 మరియు 2 అనే రెండు భాగాలు చేసుకుందాం.2 ను రెండు చేత గుణించి 11 నుండి తీసివేస్తే 7 వస్తుంది.7 అనేది ఏడు చేత భాగించబడుతుంది.
మరో ఉదాహరణ చూద్దాం:3192 అనే సంఖ్య 7 చేత భాగించబడుతుంది.
ముందు 3192 ను 319 మరియు 2 గా రెండు భాగాలు చేసుకుందాం.
                 319 - 2 x 2 = 315
 315 ను రెండు భాగాలుగా విభజిస్తే 31 మరియు 5 
                31 - 5 x 2   = 21
చివరిగా 21 ఏడు చేత భాగించబడుతుంది.కాబట్టి 3192 అనే సంఖ్య 7 చేత భాగించబడుతుంది.
సివిల్స్ ప్రిలిమ్స్ బేసిక్ న్యుమరసీ మూడవ భాగంలో గుణకారంలో ఎలాంటి లాజిక్ లు ఉంటాయో తెలుసుకోవడంతో పాటు క.సా.గు , గా.సా.భా ఇంకా మరిన్ని అంశాల మీద మెటీరియల్ చూద్దాం. 
Read more ...

పండ్లు తినడం మంచిదా…? లేక పండ్ల రసాలు తాగటం మంచిదా …?

చాలా మంది పండ్లు తినడంకంటే పండ్ల రసాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు.అయితే పండ్లు తినడం మంచిదా లేక వాటిని జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా,పండ్లు తినడం వల్ల లాభమా,పండ్ల రసాలు తాగడం మంచిదా చూద్దాం …
పండును జ్యూస్ చేసినప్పుడు రెండు కోల్పోతాం.ఒకటి గుజ్జు అయితే రెండవది పండు మీది పై పొర.
ఏ పండు అయినా పండుగానే తినడం మంచిది.ముఖ్యంగా పండ్లను జ్యూస్ చేసుకొని తాగడం వలన అందులో ఉండే పీచు పదార్థాన్ని పూర్తిగా కోల్పోతాము.పండు తొక్క ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా ద్రాక్ష పండ్ల వల్ల కాన్సర్ వ్యాధి నుండి కాపాడుకునే అవకాశం ఉంది.
పండ్ల రసాలు రుచికరంగా,తాజాగా ఉన్నప్పటికీ పండ్లు పండ్లుగానే తింటేనే ఆరోగ్యానికి మంచిది.
పండ్లను జ్యూస్ చేసే క్రమంలో పండ్లు తీవ్ర ఒత్తిడికి గురౌతాయి.ఇలా గురైనప్పుడు కొన్ని పోషకాలు,ముఖ్యంగా పీచు పదార్థాలు,నీటిలో కరిగే విటమిన్లు కోల్పోతాం.అంటే పండ్ల రసాలలో మొత్తం పోషకాలు కోల్పోనప్పటికీ పండులో ఉండే పోషకాలు పండ్ల రసాలలో ఉండే పోషకాలకంటే ఎక్కువే.
ఉదాహరణకు 500 మి.లీటర్ల నారింజ రసంలో 250 మి.గ్రా ల విటమిన్ ‘సి’ ఉంటుంది,అదే క్యాలరీల విషయానికి వస్తే  300 క్యాలరీలు ఉంటాయి,పీచు పదార్ధం ఏమాత్రం ఉండదు.ఒక నారింజ పండులో 150 మి.గ్రా ల విటమిన్ ‘సి’ ఉంటుంది.
ముఖ్యమైన విషయానికి వస్తే ఇంట్లో కంటే బయట తాగే పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఎక్కువ.బయట తాగే పండ్ల రసాలలో పండ్ల రసం శాతం తక్కువగా ఉంటుంది.వారు తయారు చేసే పండ్ల రసాలకు ఎక్కువ పంచదారతో పాటు ఎక్కువ ఐస్ ను కలుపుతారు.దీనివల్ల కావలసిన పండ్లలోని నిజమైన పోషకాల కంటే ఎక్కువ కెలోరీలు శరీరంలో చేరి ఊబకాయానికి తోడ్పడతాయి.
కాబట్టి పండ్లను ఎక్కువగా తీసుకుంటూ పండ్ల రసాలను అప్పుడప్పుడూ తీసుకోవడం మంచిది.పీచు పదార్ధం పరంగా పండ్లను,క్యాలరీల పరంగా పండ్ల రసాలు తీసుకోవచ్చు.
Read more ...

Tuesday 26 May 2015

సివిల్స్ ప్రిలిమ్స్- 2015 ప్రత్యేకం:ఉచిత ఆన్ లైన్ శిక్షణ - మొదటి భాగం


సివిల్స్- 2015 నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా radiojalsa.com ప్రిలిమ్స్ పేపర్ - I మరియు పేపర్ - II సిలబస్ లో ఉండే ప్రతీ చాప్టర్ మీద విశ్లేషణాత్మక వివరణతో పాటు,ఉపయోగపడే ప్రతీ అంశాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది.
తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేలా ప్రణాళిక చేసి మీకు అందిస్తాము.IAS,IPS తో పాటు మొత్తం 24 రకాల సర్వీస్ లకు వెలువడిన సివిల్స్ ప్రిలిమ్స్ ఆగష్టు 23న జరుగుతుంది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ సివిల్స్ రాసే అవకాశం ఉంది.
సివిల్స్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు,తెలుగు మీడియం విద్యార్థులు సాధించలేరు అనే అపోహతో పాటు సివిల్స్ సాధించడం కష్టసాధ్యం అనే అపోహ కూడా చాలా మందికి ఉంది.కాని అది నిజానికి అపోహ మాత్రమే.ఒక ప్రణాళిక బద్ధంగా చదివితే అంతగా కష్టపడకుండానే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.
ఐతే ఇంజనీరింగ్,ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకే ఎక్కువ ప్రయోజనకారిగా ఉందనే సీ-శాట్ పేపర్ లో సాధించే మార్కులను ఈసారి మెయిన్స్ ర్యాంకుల అర్హత నిర్దారణకు పరిగణనలోకి తీసుకోరు.సీ-షాట్ లో 33% మార్కులు సంపాధించుకంటే  సరిపోతుంది,అంటే 200 మార్కులకు గాను 66 మార్కులు తెచ్చుకుంటే చాలు.కాకుంటే సీ-శాట్ లో 33% మార్కులు సాధించకుంటే జనరల్ స్టడీస్ పేపర్ ను మూల్యాంకనం చేయరు.
ప్రిలిమ్స్ పేపర్ల విశ్లేషణ :
పేపర్ - I (200 మార్కులు - రెండు గంటల సమయం)
  • Current events of National and International importance.
  • History of India and Indian National Movement.
  • Indian and World Geography - Physical, Social, Economic Geography of India and the World.
  • Indian Polity and Governance -Constitution, Political System,Panchayati Raj, Public Policy,Rights Issues, etc.
  • Economic and SocialDevelopment - Sustainable Development, Poverty, Inclusion,Demographics, Social Sector initiatives,etc.
  • General issues on Environmental Ecology, Bio-diversity and Climate Change - that do not require subject specialisation
  • General Science.
పేపర్ - II (200 మార్కులు - రెండు గంటల సమయం)
  • Comprehension
  • Interpersonal skills including communication skills
  • Logical reasoning and analytical ability
  • Decision-making and problemsolving
  • General mental ability
  • Basic numeracy (numbers and their relations, orders of magnitude,etc.) (Class X level), Data Interpretation (charts, graphs,tables, data sufficiency etc. -Class X level)
పేపర్ - II లోని బేసిక్ న్యుమరసీతో మన శిక్షణ మొదలుపెడదాం....
      Basic Numeracy - I 
బేసిక్ న్యుమరసీ పూర్తిగా గణితంకు సంబంధించింది.ఇందులో కూడికలు,తీసివేతలు,గుణకారాలు,భాగాహారాలు మొదలగునవి ఉంటాయి.
1. సహజ సంఖ్యల సమితి (Natural Numbers) : {1,2,3,4,5,6,..............}
2.పూర్ణాంకాల సమితి (Whole Numbers) :  అన్ని సహజ సంఖ్యలు మరియు సున్నా కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు.
Ex : {1,2,3,4,5,6, . . .  .  .  . . . .}
3. సరి సంఖ్యలు (Even Numbers) : రెండు చేత భాగింపడే సంఖ్యలు సరిసంఖ్యలు.
Ex: 2,4,6,8, . . . . . . . . .
4. బేసి సంఖ్యలు (Odd Numbers) : రెండు చేత భాగించబడని సంఖ్యలు బేసి సంఖ్యలు.బేసి సంఖ్యలు సరి సంఖ్యల మధ్యలో ఉంటాయి.
Ex : 1,3,5,7,9, . . . . . . . . .
5. ప్రధాన సంఖ్యలు (Prime Numbers) : ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు.
Ex : 2,3,5,7,11, . . . . . . . . . .
6. పూర్ణ సంఖ్యల సమితి (Integers) : 
Ex : {. . . . . . ,-3,-2,-1,0,1,2,3, . . . . . . .}
7. అకరణీయ సంఖ్యలు(Rational Numbers) : p,q లు పూర్ణ సంఖ్యలు అయితే p/q లు అకరణీయ సంఖ్య.అంటే p/q రూపంలో రాయగలిగే సంఖ్య అకరణీయ సంఖ్య.
8. కరణీయ సంఖ్యలు (Irrational Numbers) : p/q రూపంలో రాయలేని సంఖ్యలు కరణీయసంఖ్యలు.
Ex : 0.1252525..... , 1.23234 232345 ......
9. వాస్తవ సంఖ్యల సమితి (Real Numbers) : సమితిలో ఉండే ఏ సంఖ్య(కరణీయ,అకరణీయ) అయిన వాస్తవ సంఖ్యే.
అకరణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలే కాని, వాస్తవ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలు కావు. ప్రతీ వాస్తవ సంఖ్య అకరణీయ సంఖ్య కాని, కరణీయ సంఖ్య కాని అయి తీరాలి.
వాస్తవ సంఖ్యలు : {x : x అనేది కరణీయ సంఖ్య లేక అకరణీయ సంఖ్య}



 

Read more ...
Designed By Published.. Blogger Templates