Radio LIVE


Breaking News

Thursday 23 April 2015

రిలయన్స్ ఉద్యోగులు LPG సబ్సిడీని వదులుకోవాలని పిలుపునిచ్చిన అంబానీ

ప్రధాని నరేంద్రమోడీ ధనికులంతా సబ్సిడీలను వదులుకోండని ఇచ్చిన పిలుపు మేరకు కార్పోరేట్ వర్గాలు రంగంలోకి దిగారు.
ఇప్పటికే ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, అనిల్ అగర్వాల్, ఉదయ్ కోటక్, కిషోర్ బియానీ వంటి పలువురు పారిశ్రామిక దిగ్గజాలు తమ ఉద్యోగులను సబ్సిడీ సిలిండర్ ను ఇచ్చివేయల్సిందిగా సూచించారు. తాజాగా అనిల్ అంబానీ కూడా ఈ జాబితాలో చేరారు.
మార్కెట్ రేటు పెట్టి గ్యాస్ ను కొనుక్కోగల స్థోమత ఉన్న రిలయెన్స్ ఉద్యోగులంతా LPG సబ్సిడీ సిలిండర్ ను స్వచ్ఛందంగా వదులుకోవాలని గ్రూపు ఆధినేత అనిల్ అంబానీ పిలుపునిచ్చారు.
ధనికులైన ఉద్యోగులంతా స్వచ్ఛందంగా సబ్సిడీని వదిలి భారత అభివృద్ధికి బాటలు వేయాలని, నవ భారత నిర్మాణంలో అతా తమ వంతు సహకారం అందించాలని సిబ్బందికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates