Radio LIVE


Breaking News

Monday 1 June 2015

జూలై లో 25వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ - ముఖ్యమంత్రి కెసిఆర్

తెలంగాణలో గత సంవత్సర కాలంగా ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.మంగళవారం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం కెసిఆర్ మాట్లాడుతూ జూలై లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 25వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన ప్రతిబంధకాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అయినప్పటికీ తెలంగాణాలోని నిరుద్యోగులను నిరాశకు గురిచేయకుండా జూలై లో నోటిఫికేషన్ విడుదల చేసి త్వరితగతిన ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు సీఎం.
అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్దీకరించే ప్రక్రియ కూడా జూలై నుండి మొదలు పెట్టి సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates