
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది.మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు తిరుమన్నే(44), మాథ్యూస్(40) పరుగులు చేయడంతో మంచి స్కోర్ ను విండీస్ ముందు ఉంచగలిగింది శ్రీలంక.
161 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారభించింది. ఓపెనర్లు క్రిస్ గేల్(3), స్మిత్ (17) పరుగులు మాత్రమే చేశారు. శామ్యూల్స్(16), సమీ(0) తో క్రీజ్ లో ఉండగా వర్షం పడింది. అప్పటికి విండీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఉంది. విండీస్ గెలవడానికి 107 పరుగులు అవసరం ఉండే.డిఫెండింగ్ ఛాంపియన్ లుగా బరిలోకి దిగిన విండీస్ సెమీ ఫైనల్ లో ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.
No comments:
Post a Comment