Radio LIVE


Breaking News

Tuesday 1 April 2014

దుమ్ము రేపిన విండీస్ - చిత్తైన పాకిస్తాన్

టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ కథ ముగిసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటి సారి సెమీస్ చేరకుండా పాక్ ఇంటి ముఖం పట్టింది.గ్రూప్-2 నుండి అగ్రస్థానంలో నిలిచి భారత్ సెమీస్ కు చేరిన విషయం విధితమే.ఇక సెమీస్ కు చేరే అవకాశం ఉన్న రెండు జట్లు పాకిస్తాన్,విండీస్ ఈరోజు తలబడ్డాయి. ఎవరు గెలిస్తే వారు సెమి ఫైనల్ చేరుతారు, అయితే హోరా హోరీ తప్పదు అనుకున్నా, పాకిస్తాన్ మాత్రం అంచనాలకు తగ్గట్టు ఆడలేదు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులతో కష్టాల్లో ఉన్న విండీస్ ను బ్రావో(46),సామి(40) చివర్లో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది.
లక్ష్య చేదనలో పాకిస్తాన్ తడబడింది. మొదటి బంతికే వికెట్ కోల్పోయిన పాక్ ఏమాత్రం విజయం వైపు సాగలేదు. బద్రి(3), నరైన్(3) వికెట్లతో రాణించడంతో పాకిస్తాన్ 82 పరుగులకే ఆలౌట్ అయింది.
మొదటి సెమీస్ లో ఏప్రిల్ 3న వెస్టిండీస్,శ్రీలంకతో తలబడుతుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates