Radio LIVE


Breaking News

Friday 12 September 2014

ప్రశాంతంగా కొనసాగుతున్న మెదక్,నందిగామ ఉపఎన్నికల పోలింగ్

తెలంగాణాలోని మెదక్ లోక్ సభ స్థానానికి,ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుతున్న ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
మెదక్ ఉపఎన్నిక కోసం 1817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పోలింగ్ మందకోడిగా కొనసాగుతుంది.పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని గంగాపూర్ గ్రామస్థులు,రోడ్డు సౌకర్యం లేదని పెద్దాపూర్ గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు.మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఓటు వేయగా తెరాస అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి పోచారంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి సంగారెడ్డిలో కాంగ్రేస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి గోమారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.దాదాపు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ కూడా చాల మందకోడిగా సాగుతుంది.మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.టీడీపీ అభ్యర్థి సౌమ్య నందిగామలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 16న జరుగుతుంది

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates