Radio LIVE


Breaking News

Thursday 4 September 2014

మహేష్ బాబు నిర్వహించు మీలో ఎవరు కోటీశ్వరుడు.....!

'మీలో ఎవరు కోటీశ్వరుడు' తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత ప్రజాదరణ సంపాదించుకున్న షో.నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్నాడు.కాని బుల్లి తెర మీద కాదు,వెండి తెర మీద చేస్తున్నాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న మహేష్ 'ఆగడు' ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో నిర్వహిస్తాడట,అది కూడా ఎదో నవ్వుకోవడానికి కాదు,సినిమాకు ఉపయోగపడే అత్యంత కీలకమైన సన్నివేశమని సినిమా వర్గాలు తెలుపుతున్నాయి.శ్రీనువైట్ల అంటేనే తన సినిమాల్లో నవ్వుకోవడానికి సృష్టించే పాత్రలు అద్భుతంగా ఉంటాయని తెలుసు,'దూకుడు' చిత్రంలో ఎంఎస్ నారాయణతో చేయించిన పాత్ర,బ్రహ్మానందంతో రియాలిటీ షో పేరుతొ చేయించిన పాత్ర ఇప్పటికి మరవలేనివి.అదేవిధంగా ఆగడు చిత్రంలో కూడా మహేష్ బాబు మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేస్తూ నవ్వులు పండిస్తారు అని సమాచారం.మీలో ఎవరు కోటీశ్వరుడు షో సినిమాలో ఎలా సందడి చేస్తుందో చూడాలంటే 19 వరకు ఆగాల్సిందే.మహేష్ బాబు స్వయంగా సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates