Radio LIVE


Breaking News

Wednesday 10 September 2014

జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు రూ.10లక్షలు విరాళం ప్రకటించిన విజయ్ కాంత్

60 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ లో వరదలు సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.పల్లెలతో పాటు పట్టణాలు వరదలకు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.అనేక మంది నిరాశ్రెయులయ్యారు.ఇప్పటికే కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది.
వీరిని ఆదుకోవడానికి అనేకమంది తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు.తమిళనాడుకు చెందిన DMDK అధినేత విజయ్ కాంత్ తనవంతుగా రూ.10 లక్షల విరాళాన్ని కాశ్మీర్ వరద బాధితులకు ఇస్తున్నట్టు ప్రకటించారు.వరదల్లో మృతి చెందిన వారికి,వారి బంధువులకు తన పార్టీ తరపున సంతాపాన్ని ప్రకటించారు.దేశంలో వ్యాపారవేత్తలు,ధనికులు,ఉద్యోగులు తమవంతు సహకారాన్ని కాశ్మీర్ వరద భాదితులకు అందించాలని ఈ సందర్భంగా కోరారు.
గత సంవత్సరం ఉత్తరాఖండ్ లో వరదలు ప్రళయాన్ని సృష్టించినప్పుడు కూడా విజయ్ కాంత్ రూ.10 లక్షల సహాయాన్ని అందించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates