Radio LIVE


Breaking News

Wednesday 10 September 2014

ప్రతి ఇంటికి నీరివ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యం - కెసిఆర్

తెలంగాణాలోని ప్రతి ఇంటికి నీరివ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఈరోజు వాటర్ గిడ్ పై గ్రామీణ ప్రాంత ఇంజనీర్లతో ఆచార్య జయశంకర్ వర్సిటీలో సిఎం కేసిఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎం ప్రసంగిస్తూ ప్రతి ఇంటిపై నళ్లా,మరుగుదొడ్డి ఏర్పాటుపై అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సమగ్ర మంచినీటి పథకాన్ని సిద్దిపేటలో అభివృద్ధి చేశామని అన్నారు.రాష్ట్రంలో మంచినీరు అందించే విషయంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలనిఅలాగే వేల కోట్లు వెచ్చించిన కార్యక్రమం దుర్వినియోగం కాకూడదని అధికారులను నిర్ధేశిస్తూ కింది స్థాయి ఉద్యోగులను అవగాహన పరిచి పథకం సద్వినియోగం చేయాలని సూచించారు.డబ్బు వెచ్చించడం వరకే ప్రభుత్వం పని.ఆ డబ్బును సద్వినియోగం చేయాల్సింది అధికారులేనని.అందరూ కలిసి సహకరించుకొని పని చేస్తేనే ప్రభుత్వ పథకాలు సద్వినియోగం అవుతాయని సిఎం అన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates