Radio LIVE


Breaking News

Wednesday 10 September 2014

పద్మ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించిన కేంద్రం

2015 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాల కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.వివిధ రంగాల్లో నిష్ణాతులకు ఇచ్చే పద్మ అవార్డుల కోసం సెప్టెంబర్ 15వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.
దరఖాస్తు చేసుకోదలచిన వారు దరఖాస్తు ఫారాలను నేరుగా కేంద్ర హోంమంత్రి లేదా కేంద్ర హోం సెక్రెటరీ లకు న్యూఢిల్లీ లోని నార్త్ బ్లాక్ లో ఉన్న వారి కార్యాలయాల్లో అందజేయవచ్చు.దరఖాస్తు నమూనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో లభిస్తుంది.
వెబ్ సైట్ : http://mha.nic.in/sites/upload_files/mha/files/Proforma-Englis hRevised-050514.pdf
రెండు పేజీలకు మించకుండా నిర్ణీత నమూనాలో దరఖాస్తు నింపి 800 పదాలకు మించకుండా తమగురించి దరఖాస్తులో పొండుపరచాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates