Radio LIVE


Breaking News

Saturday 13 September 2014

ప్రముఖులకు గీతం స్నాతకోత్సవంలో డాక్టరేట్ల ప్రధానం

ఘనంగా గీతం యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు,రక్షణ పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శి డాక్టర్ అవినాశ్ చందర్,దర్శకుడు రాఘవేంద్రరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజా కిరణ్,ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
వీరికి గీతం ఛాన్సలర్ డాక్టర్ కోనేరు రామకృష్ణ రావు డాక్టరేట్లను ప్రధానం చేశారు.
అవినాశ్ చందర్ అనంతరం మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచమేటి శక్తిగా ఎదుగుతుందని ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాలు దేశానికి ఉపయోగపడే పరిశోధనలకు కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates