Radio LIVE


Breaking News

Tuesday 26 August 2014

టీఆర్ఎస్ లో చేరనున్న వైరా వైసీపీ ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా వైరా వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ లాల్ త్వరలో తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు.పార్టీ అధ్యక్షుడు సీఎం కెసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమైంది.ఈ విషయమై సీఎం కెసిఆర్ ను మంగళవారం వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కలుసుకొని తెరాసలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశం అయిన మదన్ లాల్ రెండు మూడు రోజుల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్ట్ కు అనుకూలంగా ఉన్న జగన్ ను అందుకు వ్యతిరేఖంగా ఒప్పించడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు అని,మదన్ లాల్ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యే లు పార్టీ విడిచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

More News @ RADIOJALSA

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates