Radio LIVE


Breaking News

Saturday 15 March 2014

కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి వల్లా కాదు - చిరంజీవి


ఎట్టకేలకు తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలకు చిరంజీవి స్పందించారు.చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు బావోధ్వేగం ఎక్కువ
, పార్టీ పెట్టుకోవడం ఆయన వ్యక్తిగతం, ప్రజల మద్దతు ఉన్న పార్టీలే మనుగడ సాగిస్తాయి. తమ్ముడి పార్టీ విధివిధానాలు నాకు అర్థం కాలేదు,ఇంకా స్పష్టత రావాల్సింది అని అన్నారు.కాంగ్రెస్ వైపు వేలు చూపించే ముందు మిగతా పార్టీల వైపు కూడా చూపించాలి.
   అన్ని పార్టీల నిర్ణయం తరువాతే కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించింది అని మరిచిపోకూడదు. కాంగ్రేస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎవరివల్లా కాదు,కొందరు బంగాళాఖాతంలో కలుపుత అన్న వారి మాటలు ఏమయ్యాయి. నేను భారతీయున్ని అని తమ్ముడు   చెప్పడం సంతోషం,అయితే భారతీయున్ని  అని చెప్పుకునేలా అవకాశం కల్పించింది మాత్రం కాంగ్రేస్ పార్టీ మాత్రమే అని అన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates