Radio LIVE


Breaking News

Monday 31 March 2014

పోరాడి ఓడిన ఇంగ్లాండ్ - సెమీస్ కు చేరిన దక్షిణాఫ్రికా

శనివారం చిట్టగాంగ్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన హోరా హోరి పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించి సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఆమ్లా(56),డీ కాక్(29) మొదటి వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో డివిలియర్స్(69* 28బంతుల్లో) చెలరేగడంతో 196 పరుగుల భారీ స్కోర్ ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ కూడా దీటుగా ఆడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. హేల్స్(38),బట్లర్(34) రాణించారు. డివీలియర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates