Radio LIVE


Breaking News

Tuesday 28 April 2015

సౌదీలో కుప్పకూలిన భవనం..మృతి చెందిన 10మంది కూలీలు

సౌదీ అరేబియాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10మంది కూలీలు మరణించారు. ఈ భవన నిర్మాణం రియాద్ లోని అల్ ఖాసిమ్ విశ్వవిద్యాలయం సమీపంలో జరుగుతుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారు 9 మంది పాకిస్తాన్ కు చెందిన కూలీలు కాగా ఒకరు భారత్ కు చెందిన వారు ఉన్నారు. భవనంపై కాంక్రీట్ ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.అయితే ఇప్పటి వరకు 6 మృతదేహాలను వెలికితీయగా మిగిలిన వరీకోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates