Radio LIVE


Breaking News

Wednesday 22 April 2015

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ

టెక్ మహేంద్రా ఫౌండేషన్ సహకారంతో యుగాంతర్ సంస్థ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిసున్నట్లు యుగాంతర్ సంస్థ మొబిలైజేషన్ కో ఆర్డినేటర్ కే.నిరంజన్ యాదవ్ తెలిపారు. 10 వ తరగతి పాస్ ఆపై విద్యార్హతలు కలిగిన 18 నుంచి 27 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులని ఆయన అన్నారు. కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్-ఆఫీస్ 2010,స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంగ్లీష్ టైపింగ్, కమ్యునికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యు స్కిల్స్, టాలీ ఈఆర్పీ9,బేసిక్ అకౌంట్స్, అడ్వాన్స్ డ్ ఎంఎస్ ఎక్సెల్ తదితర కోర్సులలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 25వ తేదీలోగా కొఠీ శిక్షణ కేంద్రంలో అర్హులైన యువతీయువకులు తమ పేర్లను నమోదు చేస్తుకోవల్సిందిగా ఆయన అన్నారు. ఇతర వివరాలకు 9030055998, 9959627037 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates