Radio LIVE


Breaking News

Monday 4 May 2015

ఆవుకు హాల్ టిక్కెట్..మే 10న పరీక్షకు హాజరుకానున్న గోమాత


వచ్చే ఆదివారం శ్రీనగర్ లో జరగాల్సి ఉన్న పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓ ఆవుకు హాల్ టిక్కెట్ వచ్చింది. ఆశ్చర్యపోకండి..మీరు చదివింది నిజమే.
అధికారులు పరీక్ష రాసే అవకాశాన్ని సాక్షాత్తూ గోమాతకే కల్పిస్తూ హాల్ టిక్కెట్ ను మంజూరు చేసేశారు.
హాల్ టిక్కెట్ పై అభ్యర్ధిని పేరు ‘గోధుమరంగు గోవు’.., తండ్రిపేరు ‘ ఎర్రని ఎద్దు’గా పేర్కొంటూ హాల్ టిక్కెట్ ను జారి చేశారు.
అంతేకాదు పరీక్షా కేంద్రంగా ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా కేటాయించారు.



ఈ విషయపై జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ “ అద్భుతం! గోధుమరంగు గోమాత పరీక్షకు హాజరుకావాలని తాను కోరుకుంటున్నట్లు” వెల్లడించారు. మే 10వ తేదీన జరిగే పరీక్షకు ఈ గోమాత హాజరు కావడమే ఇక మిగిలింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates