Radio LIVE


Breaking News

Friday 1 May 2015

రూ.లక్షకి కట్టుకున్న భార్యనే ఇచ్చేసిన రైతు

ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే  రూ.లక్ష నగదు కోసం మరో వ్యక్తికి ఇచ్చేశాడు. 
గంగతలా గ్రామానికి చెందిన రైతు భార్యను అదే గ్రామానికి చెందిన గూండా ఒకరు బలవంతంగా పలుమార్లు లొంగదీసుకున్నాడు.
దీంతో ఆ రైతు విషయాన్ని పంచాయతీ పెద్దల వద్దకు తీసుకెళ్లాడు.
ఈ విషయం విన్న పంచాయతీ పెద్దలు రూ.లక్ష నగదు, కొంత స్థలం తీసుకొని తన భార్యను గూండాకు ఇచ్చేయమని రైతుకు సలహా ఇచ్చారు.
రైతు బలవంతుడైన గూండాకు అడ్డుచేప్పే ధైర్యం లేక పంచాయతీ ప్రతిపాదనకు అంగీకరించాడు.
దీంతో సదరు మహిళ దైర్యంచేసి పంచాయతీ తీర్పును వ్యతిరేకించింది.
అంతేకాదు తన మొగుడ్ని కూడా వదిలేసి కొందరు గ్రామస్థుల సహాయంతో తన బిడ్డతో కలిసి వేరే ఇంట్లో ఒంటరిగా కాపురం పెట్టింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates