Radio LIVE


Breaking News

Monday 4 May 2015

అంధురాలిపై 3నెలల్లో 9 మంది అత్యాచారం ఆపై అమ్మకం..

రాజస్థాన్ లోని చందనఖేడి గ్రామంలో దారుణం జరిగింది. ఓ అంధురాలిపై 3 నెలల్లో 9 మంది అత్యాచారాలకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..ఆమె అంధురాలు.
ఇంటి ముందు కూర్చుని ఉండగా ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెను అపహరించుకుపోయాడు. వేరేక్కడో ఓ ఇంట్లో ఆమెను ఉంచి 3నెలల వ్యవధిలో ఆమెపై 9 మంది కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను రూ.50,000కు అమ్మకానికి పెట్టారు.
అయితే అంధురాలు కావడంతో
ఆమెను ఎవరూ కొనుక్కోలేదు.
దీంతో ఆమెను తీసుకువచ్చి మళ్లి ఇంటి ముందే వదిలి వెళ్లిపోయాడు.
ఈ మేరకు బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు పేర్కొంది.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసులో SP సత్యేంద్ర సిన్హా బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates