Radio LIVE


Breaking News

Sunday 31 May 2015

రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్,ఓటు వేసే అవకాశం కల్పించిన కోర్టు

ఆదివారం సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయిన రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఏసీబీ న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపరిచారు.
అనంతరం రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.రేవంత్ రెడ్డి మీద 120B, 34 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఏ 1 - రేవంత్ రెడ్డి
ఏ 2 - సెబాస్టియన్
ఏ 3 - ఉదయ్ సింహ
ఏ 4 - మాథ్యూస్ జెరూసలెం
ఐతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమంతించాలని రేవంత్,న్యాయమూర్తిని కోరగా అందుకు పిటీషన్ దాఖలు చేయమని కోరగా అందుకు రేవంత్ రెడ్డి లాయర్లు పిటీషన్ దాఖలు చేయగా అందుకు న్యాయమూర్తి ఓటు వేసేందుకు అనుమతించారు.అనంతరం 14 రోజుల రిమాండ్ కోసం రేవంత్ ను చర్లపల్లి జైలు కు తరలించనున్నారు.
ఓటు వేసేందుకు రేవంత్ ను పోలీసులు అసెంబ్లీ ఆవరణకు తీసుకొచ్చారు.రేవంత్ వచ్చే వరకు అసెంబ్లీ ప్రాంగణంలోనే టీ-టీడీపీ ఎమ్మెల్యేలు వేచి ఉండి రేవంత్ రాగానే ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు తోటి ఎమ్మెల్యేలు.అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో కొంతసేపు భేటీ అయ్యారు. ఆ తరువాత బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ను కలిశారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates