Radio LIVE


Breaking News

Monday 4 May 2015

తెలంగాణ సీఎస్ తో భేటి అయిన ఆస్ట్రియా సైంటిస్టుల బృందం

ఆస్ట్రియా సైంటిస్టుల బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో భేటి అయింది.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ నేపధ్యంలోనే ఆదివారం ఆస్ట్రియా సైంటిస్టుల బృందం హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు.
ఈ మేరకు సోమవారం డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన పద్ధతిలోనే హుస్సేన్ సాగర్ ని కూడా శుద్ధి చేసే ఛాన్స్ ఉందని వారు సూచించారు.
ఈ బృందం మంగళవారం దీనిపై ముఖ్యమంత్రి KCR కు నివేదికను ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates