Radio LIVE


Breaking News

Saturday 25 October 2014

నవంబర్ 19 న ప్రధాని మోడీ ఫిజీ పర్యటన

నవంబర్ 19 న భారత ప్రధాని మోడీ ఫిజీలో పర్యటించనున్నారు.నవంబర్ 12,13 తేదీల్లో మయన్మార్ రాజధాని నేపైతాలో నిర్వహించే తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం (ఈఏఎస్)లో ప్రధాని తొలుత పాల్గొంటారు. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి 15,16 తేదీల్లో బ్రిస్బెస్ లో జరిగే జీ-20 సమావేశాల్లో పాల్గొంటారు.అనంతరం 18 న ఆస్ట్రేలియా ప్రధాని అబోట్ తో కాన్బెర్రాలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నవంబర్ 19న ఫిజీలో పర్యటిస్తారు.నవంబర్ 26 న నేపాల్ లో నిర్వహించనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కానున్నారని తెలుస్తున్నది.
1948 అక్టోబర్ 24 న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐ.రా.స ఆవిర్భావ దినం సందర్భంగా శుక్రవారం మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ ఐ.రా.స సభ్య దేశాలు ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం పాటు పడాల్సిన సమయమని మోడీ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates