Radio LIVE


Breaking News

Saturday 11 October 2014

రెండో వన్డేలో విండీస్ ను చిత్తు చేసిన భారత్

విండీస్ తో జరుగుతున్న వన్డే సీరీస్ లో కోచిలో జరిగిన మొదటి వన్డేలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్న భారత్ శనివారం ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో సత్తా చాటింది.48 పరుగుల తేడాతో విండీస్ ను ఓడించి సీరీస్ ను 1-1 తో సమం చేసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.ఫామ్ తో తంటాలు పడుతున్న కోహ్లి ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో రాణించి 62 పరుగులు చేశాడు.సురేష్ రైనా ధాటిగా ఆడుతూ 62 పరుగులు చేశాడు.చివర్లో ధోని 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.జెరోమ్ టేలర్ 3 వికెట్లు తీసుకున్నాడు.
264 పరుగుల లక్ష్యం  ఫెరోజ్ షా కోట్ల మైదానం పిచ్ మీద కొంత కష్ట సాధ్యమే అయినప్పటికీ విండీస్  బరిలోకి దిగిన విండీస్ లక్ష్యాన్ని సునాయాసంగానే చేధించేలా కనిపించింది.ఒక దశలో 182 పరుగులకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి బలంగా ఉన్న విండీస్ ఒక్కసారిగా కుప్పకూలింది.డ్వేన్ స్మిత్ 97 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు.ఇక అంతే వరుసబెట్టి వికెట్లను కోల్పోయింది విండీస్.చివరకు 46.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.షమీ 4 వికెట్లు తీసుకోగా,జడేజా 3,అమిత్ మిశ్రా  2,ఉమేష్ 1 వికెట్ సాధించారు.
కెరీర్ బెస్ట్ సాధించిన షమీకి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.





No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates