Radio LIVE


Breaking News

Saturday 25 October 2014

ఉపరితల ద్రోణి,వాయుగుండం – మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు

తూర్పు అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగడంతోపాటు,శ్రీలంక నుండి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.దీని ప్రభావంతో తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లలో మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి.రానున్న 48 గంటల్లో అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫాన్ గా మారి గుజరాత్ వైపు వెళ్ళనుంది.
ఈ నెల 18న నైరుతి ఋతుపవనాలు దేశంనుండి వెనక్కి మళ్ళగా అదేరోజు తమిళనాడు,కేరళ,కర్ణాటకలో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా సాగడం మొదలెట్టాయి.ఈ ఋతుపవనాల కారణంగా దక్షిణ భారతదేశంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates