Radio LIVE


Breaking News

Tuesday 21 October 2014

విండీస్ తో ఇక నో క్రికెట్ – బీసీసీఐ

వెస్టిండీస్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ను బీసీసీఐ రద్దు చేసుకుంది.శివలాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్,బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ మరియు బీసీసీఐ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో వెస్టిండీస్ జట్టు భారత్ సీరీస్ లో అర్దాంతరంగా నిష్క్రమణపై చర్చించారు.బీసీసీఐ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
పర్యటనను రద్దు చేసుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై దావా వేస్తామని బీసీసీఐ తెలిపింది.
భారత పర్యటన రద్దు చేసుకుంది ఆటగాళ్ళే అయినా వారి జోలికి వెళ్ళే సాహసం మాత్రం బీసీసీఐ చేయలేకపోయింది.దీనికి కారణం ఐపీఎల్ ప్రాంచైజీలు అందుకు నిరాకరించడమే.
వెస్టిండీస్ పర్యటన రద్దు కారణంగా బీసీసీఐ రూ.400 కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates