Radio LIVE


Breaking News

Thursday 9 October 2014

టీఆర్ఎస్ లోకి తీగల,తలసాని !

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ గురువారం టీడీపీ సీనియర్ నాయకులు తలసాని,తీగల ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశారు.వీరు టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయింది.వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ధర్మారావు,ప్రకాశ్ గౌడ్,ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ కెసిఆర్ ను కలిశారు.
అయితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కెసిఆర్ తో భేటీ అనంతరం మాట్లాడుతూ టీడీపీని వీడడం లేడని అన్నారు.
తలసాని మాట్లాడుతూ తెలంగాణాలో కరెంటు కష్టాలకు టీడీపీ నే కారణమని ఆరోపించారు.మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో టీడీపీకి నాయకత్వం లేనట్టు లోకేష్ ను నియమించడం మమ్మల్ని అవమానపరచడమే అని అన్నారు.
వెంటనే తెలంగాణా టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు.అనంతరం ఎల్ రమణ మాట్లాడుతూ ప్రకాశ్ గౌడ్,ధర్మారెడ్డి పార్టీని వీదడంలేదని అన్నారు.పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంగించినా చర్యలు తప్పవని అన్నారు.మరో టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారే విషయంపై వివరణ ఇచ్చారు.ప్రాణం ఉన్నంత వరకు టీడీపీతోనే ఉంటానని తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates