Wednesday, April 09, 2025

Radio LIVE


Breaking News

Tuesday, 28 April 2015

రాష్ట్ర పోలీసులను సిమి ఉగ్రవాదులపై రివార్డును స్వీకరించాలని కోరిన మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసు ఎదురుకాల్పుల్లో హతమైన సిమి ఉగ్రవాదులపై ఉన్న రివార్డును స్వీకరించాలని తెలంగాణ పోలీసులను కోరింది. గతంలో మధ్యప్రదేశ్ ఖండ్వా జైలు నుంచి అస్లాం, జాకీర్ హుస్సేన్, ఎజూజుద్దీన్, హమబూబ్, అంజద్ లు పరారయ్యారు. వీరిపై అక్కడి పోలీసులు ఒక్కొక్కరిపై రూ.1 లక్ష చొప్పున రివార్డు ప్రకటించింది. అయితే వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు అస్లాం, ఎజాజు లు ఇటివలే నల్గొండ జిల్లా జానకీపురం ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. దీంతో వీరి పేరున ఉన్న రివార్డును స్వీకరించాల్సిందిగా తెలంగాణ పోలీసు శాఖకు మధ్యప్రదేశ్ పోలీసుశాఖ ఓ లేఖ రాసింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates