Radio LIVE


Breaking News

Wednesday, 1 April 2015

బతికున్నంత కాలం జైల్లోనే,కర్నూల్ కోర్టు సంచలన తీర్పు


ఈరోజు కర్నూల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు బతికున్నంత కాలం జైల్లోనే ఉండాలని అరుదైన తీర్పును ఇచ్చారు జడ్జీ వెంకట జ్యోతిర్మయి . ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే లక్ష్యంగా గత కొంత కాలంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఆటో డ్రైవర్లు మట్టి రవి,శ్రీను లు.ఇది వరకు అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ అత్యాచారాలకు పాల్పడుతుండేవారు వీరు.కర్ణాటకకు చెందిన ఒక మహిళను కొన్ని రోజుల క్రితం అత్యాచారం చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసి విచారించగా దాదాపు 20 మంది యువతుల మీద అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నారు ఈ దుర్మార్గులు. చనిపోయేవరకు జైల్లోనే ఉండాలని ఈరోజు వీరికి వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది.వీరి తరుపున వాదించడానికి ఒక్క న్యాయవాది కూడా ముందుకు రాలేదు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates