Radio LIVE


Breaking News

Wednesday, 1 April 2015

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిగా ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు ముఖ్యమంత్రి.రాజధానికి వాస్తుకు తగ్గట్టే పేరు కూడా బలంగా ఉంది,ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతి ప్రసిద్ధి చెందింది,నాలుగు వందల సంవత్సరాలపాటు శాతావాహనులు పరిపాలించారు అమరావతిని,అలాగే అమరావతికి ధాన్యకటకంగా పేరుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
బౌద్ధులు పరమ పవిత్రంగా భావించిన నగరం అమరావతి,ప్రపంచంలోనే అధునాతన నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం,దేశ వ్యాప్తంగా ఎన్నికైన వారసత్వ నగరాల్లో అమరావతి ఒకటి ,ఈ రాజధాని ప్రజా రాజధానిగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
సింగపూర్ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఈ సందర్బంగా విడుదల చేశారు,సింగపూర్ ఉచితంగా మాస్టర్ ప్లాన్ ను అందించింది,రాజధాని మాస్టర్ ప్లాన్ లో మొత్తం మూడు భాగాలు ఉంటాయి,మే-15 లోగా మాస్టర్ ప్లాన్ ఇస్తారు,15 లక్షల ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తాము,21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతిస్తాం,గన్నవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయం మారుస్తాం,కృష్ణా నదిపై దాదాపు 5 వంతెనలు ఏర్పాటు చేస్తాము,స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు,ప్రత్యేక హోదా పై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అని సీఎం తెలిపారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates