బుధవారం శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్ర చందనం కూలీలను చంపడంతో వారికి తిరుపతి రుయా ఆసుపత్రి లో పోస్ట్ మార్టం జరుగుతున్న సందర్బంగా అక్కడికి చనిపోయిన వారి బంధువులు భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్నారు.అనేక ప్రజాసంఘాలు కూడా ఈ విషయమై ఆందోళన చేస్తున్నారు.
పోస్ట్ మార్టం సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.ఐతే ఆసుపత్రికి వచ్చే రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
తమిళనాడులో ఆందోళనలు తీవ్రంగా జరుగుతుండడంతో అక్కడికి వెళ్ళే బస్సులని APSRTC ఈరోజు కూడా ఆపేసింది.తమిళనాడు లోని ఆంధ్ర భవన్ల దగ్గర భారీ బందోబస్తు పెట్టారు.
ఈ ఘటనలో చనిపోయినవారంత తమిళనాడు కు చెందిన వారే.అందులో 4గురు వేలూరు,8మంది విల్లుపురం,ఇంకో 8 మంది తిరువన్నామలై కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

No comments:
Post a Comment